తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి సీజన్ నుంచి 4వ సీజన్  వరకు కూడా బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫుల్ టైమ్  ఎంటర్టైన్మెంట్ పంచుతుంది.. అంతకంతకు క్రేజ్ సంపాదించుకుంది  బిగ్ బాస్ షో.  ఇక ప్రతి సీజన్లో కూడా కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎంతో మంది ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేయడమే కాదు ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి ఎంతో విజయవంతంగా ఈ రియాలిటీ షో కొనసాగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.. ఇక రెండవ సీజన్ కి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.


 ఇక బిగ్బాస్-3,4  సీజన్ లకు  టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించాడు అన్న విషయం తెలిసిందే.  నాగార్జున తన వాక్చాతుర్యంతో ఎంతమంది బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.  అయితే బిగ్ బాస్ హౌస్ లో కెమెరాలు ఎప్పుడు ఆసక్తికర విషయాల పై ఫోకస్ పెడుతూ కంటెస్టెంట్స్ మధ్య కాంట్రవర్సీ లను.. లవ్ స్టోరీలను ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ కెమెరాలు చూపించే ఫుటేజ్ పై ఇటీవలే బిగ్బాస్ సీజన్ వన్ విన్నర్ శివ బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీడియా ఛానల్ లో ఇంటర్వ్యూ కు హాజరైన శివబాలాజీ.. బిగ్ బాస్ హౌస్ లో కెమెరాలు దొంగ కెమెరాలు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్స్ గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటూ యాంకర్ ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు శివబాలాజీ. బిగ్ బాస్ హౌస్ లో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచింది అని చెప్పిన శివబాలాజీ.. లోపల ఉన్న కంటెస్టెంట్స్ కి.. తమ వద్ద ఉన్నది స్నేహమే అన్న క్లారిటీ ఉంటుంది కాని బయటకి బిగ్ బాస్  కెమెరాలు చూపించేది మాత్రం మరోలా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ముందుగా ఎంతో ఎఫెక్టివ్ గా  ప్రోమో క్రియేట్ చేస్తారని.. ఇందులో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నట్లుగా చూపిస్తారని ఇక ఎపిసోడ్ లో ప్రేక్షకులు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు అంటూ శివబాలాజీ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో దొంగ కెమెరాలు ఉంటాయని.. లోపల జరిగే దానికి బయట చూపించే దానికి అసలు సంబంధం ఉండదు అంటు  చెప్పుకొచ్చాడు శివబాలాజీ.

మరింత సమాచారం తెలుసుకోండి: