టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్దేకి చాలా రోజుల తర్వాత కోలీవుడ్ నుండి క్రేజీ ఆఫర్ వచ్చింది. అసలు తెలుగులో పరిచయం కాకముందే తమిళంలో జీవ హీరోగా వచ్చిన మూగముడి సినిమాలో నటించింది పూజా హెగ్దే. ఆ తర్వాతే తెలుగులో ఒక లైలా కోసం, ముకుంద సినిమాలు చేసింది. అయితే అమ్మడికి అల్లు అర్జున్ డీజే నుండి క్రేజ్ వచ్చింది. బికిని షోలో పూజా హెగ్దే అందాలకు తెలుగు ప్రేక్షకులు పడిపోయారు. ఇక ఆ సినిమా నుండి అమ్మడు తిరిగి చూసుకోలేదు.

వరుస స్టార్ అవకాశాలు అందుకుంటూ రెచ్చిపోతున్న పూజా హెగ్దే 50 లక్షల రెమ్యునరేషన్ నుండి 2 కోట్లు దాకా డిమాండ్ చేసే రేంజ్ కు వెళ్లింది. ఇక తెలుగులో ఈ రేంజ్ ఫాం కొనసాగిస్తున్న అమ్మడికి కోలీవుడ్ నుండి బంపర్ ఆఫర్ తగిలిందట. ఇళయదళపతి విజయ్ హీరోగా నెల్సన్ దిలిప్ కుమార్ డైరక్షన్ లో ఓ సినిమా వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దేని ఫిక్స్ చేశారట దర్శక నిర్మాతలు.

సౌత్ పరిశ్రమకు తమిళ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చినా అమ్మడి టాలెంట్ ను అక్కడ ఎవరు గుర్తించలేదు. అయితే తెలుగులో మాత్రం పూజా హెగ్దేకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక్కడ అందం అభినయం రెండిటితో ఆడియెన్స్ ను కట్టిపడేస్తుంది. పూజా అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అందుకే ఆమెకి ఇక్కడ భారీ క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం పూజా హెగ్దే తెలుగులో ప్రభాస్ తో రాధే శ్యాం, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలు చేస్తుంది. ఈ సినిమాల తర్వాత మహేష్, వంశీ పైడిపల్లి సినిమాతో పాటుగా మరో స్టార్ సినిమా ఆఫర్ కూడా లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.                      



మరింత సమాచారం తెలుసుకోండి: