అయితే ఈ వసూళ్లు వచ్చింది ఫస్ట్ రిలీజ్లో మాత్రమే.. తర్వాత ఏళ్లకు ఏళ్ల పాటు షోలే సినిమాను రీ రిలీజ్ చేస్తూ భారీగా వసూళ్లు కొల్ల గొడుతూ వస్తున్నారు. చివరకు సిప్పీ కుటుంబానికి చిల్లర ఖర్చులు కావాల్సి వచ్చినప్పు డల్లా షోలే ను రీ రిలీజ్ చేస్తున్నారన్న జోక్ కూడా బాగా ఈ దశాబ్దాలుగా వైరల్ అయ్యింది. దీనిని బట్టి షోలే భారతీయ సినిమా రంగంలోనే కాకుండా.. సమాజంపై కూడా ఎంతలా ప్రభావం చూపి.. వారి మనస్సుల్లోకి చొచ్చుకుపోయిందో అర్థమవుతోంది.
షోలే డైరెక్టర్ రమేష్ సిప్పి నాడు తన తండ్రి జీ పీ సిప్పినీ చూసి సినిమాల్లోకి వచ్చాడు. ముందుగా జావెద్ అక్తర్ లతో స్నేహం చేసి సీతా ఔర్ గీతా తీశాడు. ఆ సినిమా హిట్ అయ్యాక అబ్బాయ్ ఏదైనా పెద్ద సినిమా తీయరా అని తండ్రి కోరిన కోరిక మేరకు ఆయన మదిలో పుట్టిన కథే ఈ షోలే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక దొంగను పట్టుకునేందుకు దొంగలను నియమించడం దీని కథ. ఆ దొంగ గబ్బర్ సింగ్, అతణ్ణి పట్టుకునే దొంగలు వీరూ, జయ్. ముందుగా ప్లాప్ టాక్ వచ్చినా ఆ తర్వాత ఈ సినిమా రికార్డులు బీట్ చేసింది.