భార‌తీయ సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఎప్ప‌టకి చెక్కు చెద‌ర‌ని స్థానం సంపాదించుకున్న సినిమా షోలే. ద‌ర్శ‌కుడు ర‌మేష్ సిప్పి ధైర్యం చేసి ఆ రోజుల్లోనే ఈ సినిమాను రు. 3 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించారు. త‌న‌ తండ్రి జి.పి.సిప్పీ చేత భారీ పెట్టుబడి పెట్టించి షోలే తీయించి త‌ర‌త‌రాల పాటు త‌మ వంశానికి డ‌బ్బుల వర్షం కురిసేలా చేశాడు. 1975 లో నాడు రు. 3 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన ఈ సినిమా రు. 35 కోట్లు కొల్ల‌గొట్టింది. ఈ రు. 35 కోట్ల‌ను ఈ రోజు వ‌సూళ్ల‌తో లెక్కించి చూస్తే 800 కోట్లు అవుతుంది.

అయితే ఈ వ‌సూళ్లు వ‌చ్చింది ఫ‌స్ట్ రిలీజ్‌లో మాత్ర‌మే.. త‌ర్వాత ఏళ్ల‌కు ఏళ్ల పాటు షోలే సినిమాను రీ రిలీజ్ చేస్తూ భారీగా వ‌సూళ్లు కొల్ల గొడుతూ వ‌స్తున్నారు. చివ‌ర‌కు సిప్పీ కుటుంబానికి చిల్ల‌ర ఖ‌ర్చులు కావాల్సి వ‌చ్చిన‌ప్పు డ‌ల్లా షోలే ను రీ రిలీజ్ చేస్తున్నార‌న్న జోక్ కూడా బాగా ఈ ద‌శాబ్దాలుగా వైర‌ల్ అయ్యింది. దీనిని బ‌ట్టి షోలే భార‌తీయ సినిమా రంగంలోనే కాకుండా.. స‌మాజంపై కూడా ఎంత‌లా ప్ర‌భావం చూపి.. వారి మ‌న‌స్సుల్లోకి చొచ్చుకుపోయిందో అర్థ‌మ‌వుతోంది.

షోలే డైరెక్ట‌ర్ ర‌మేష్ సిప్పి నాడు త‌న తండ్రి జీ పీ సిప్పినీ చూసి సినిమాల్లోకి వ‌చ్చాడు. ముందుగా జావెద్ అక్త‌ర్ ల‌తో స్నేహం చేసి సీతా ఔర్‌ గీతా తీశాడు. ఆ సినిమా హిట్‌ అయ్యాక అబ్బాయ్ ఏదైనా పెద్ద సినిమా తీయ‌రా అని తండ్రి కోరిన కోరిక మేర‌కు ఆయ‌న మ‌దిలో పుట్టిన క‌థే ఈ షోలే. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ఒక దొంగను ప‌ట్టుకునేందుకు దొంగలను నియమించడం దీని కథ. ఆ దొంగ గబ్బర్‌ సింగ్, అతణ్ణి పట్టుకునే దొంగలు వీరూ, జయ్‌. ముందుగా ప్లాప్ టాక్ వ‌చ్చినా ఆ త‌ర్వాత ఈ సినిమా రికార్డులు బీట్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: