కాగా అనిల్ కపూర్ తనయురాలు సోనమ్ కపూర్ 2007 లో రణ్ బీర్ కపూర్ సరసన సావరియా చిత్రంతో బాలీవుడ్ కి పరిచయం అయ్యి తరవాత చాలా విజయవంతమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు .ఈ నేపథ్యంలో యాంకర్ రష్మీ గౌతమ్ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది.
కరోనా వైరస్ వలన దేశమంతటా లాక్ డౌన్ విధించడంతో సెలబ్రెటీలు నుండి సామాన్య ప్రజల వరుకు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు .నిత్యావసరాల కోసం మరియు అత్యవసర పరిస్థితులలో తప్ప ఎవరు బయటకి రావడం లేదు. సెలబ్రెటీలు కరోనా వైరస్ పై స్పందిస్తూ మరియు వారు ఈ లాక్ డౌన్ లో ఎలా గడుపుతున్నారనే దానిపై ట్వీట్ చేస్తున్నారు .
తాజాగా సోనమ్ నేను ఓ చాకోలెట్ కేక్ చేశాను. నేను చేయాలనుకున్న టైమ్కి ఇంట్లో చాక్లెట్ లేకపోతే ఓ పుడ్ సప్లై సంస్థ నాకు చాలా క్వాలిటీ గల చాక్లెట్ను పంపింది. చాక్లెట్ పంపించి నాకు సహకరించిన వారికి ధన్యవాదాలు.లవ్యూ న్యూ ఢిల్లీ అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన రష్మీ.సరిలేరు నీకెవ్వరు లో మహేశ్ బాబు చెప్పిన బాధ్యత ఉండక్కర్లా డైలాగుతో సోనమ్పై ఫైర్ అయ్యింది.