బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరియు అతని తమ్ముడు రాకేష్ సావంత్ పై ఢిల్లీ లో కేసు నమోదు అయ్యింది. అయితే నాలుగు సంవత్సరాలకు ముందు వీరిపై కేసు ఉండగా తాజాగా వికాస్ పురి  స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. శైలేష్ శ్రీవాస్తవ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.

అయితే  2017 లో శైలేష్ శ్రీవాస్తవ రాకేష్ మరియు రాజ్ కంత్రి అనే ఇద్దరు వ్యక్తులను కలిశారు. అప్పుడు డాన్స్ ఇన్స్టిట్యూట్ అనే ఒక  ప్రతిపాదనను శైలేష్ వారి ముందు ఉంచాడు. ఈ క్రమంలో డాన్స్ ఇన్స్టిట్యూట్ కు సంబంధించి పనుల కారణంతో ఆరు లక్షల డబ్బులను శైలేష్ నుండి వాళ్ళు  తీసుకున్నారు. దానికి తోడు ఒక చెక్ ని శైలేష్ కు ఇచ్చారు.

దానిని తీసుకోని బ్యాంకు వెళ్లిన శైలేష్ ఆ చెక్ పై ఉన్న సంతకం సరైనది కాకా పోవడంతో బ్యాంకు వాళ్ళు ఆ చెక్ ను తీసుకోలేదు. దీనితో అనుమానం వచ్చిన శైలేష్ రాకేష్ మరియు రాఖీ సావంత్ లకు ఫోన్లు చేయగా వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడంతో శైలేష్ మోసపోయానని గ్రహించి వెంటనే పోలీస్ స్టేటన్ కి వెళ్లి రాఖీ సావంత్ మరియు రాకేష్ లపై కేసు నమోదు చేసాడు. అయితే ఈ కేసుపై ఇంతవరకు ఆమె మరియు సోదరుడు స్పందించకపోవడం విశేషం.

అయితే రాఖీ సావంత్ హిందీ బిగ్ బాస్ సీజన్ 14 లో పాల్గొన్న విషయం తెలిసిందే. అందులో టాప్ ఫైవ్ లో చోటు సంపాదించిన రాఖీ ఆ వచ్చిన డబ్బుతో ఆమె తల్లి అనారోగ్యం కోసం ఉపయోగించనుంది. ఆమె తల్లి అనారోగ్య పరిస్థితి దృష్ట్యా కొందరు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ సోదరుడు కూడా తనకి ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: