టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం కొరటాల శివ తీస్తున్న మెసేజ్ తో కూడిన కమర్షియల్ జానర్ మూవీ ఆచార్య. తనయుడు చరణ్ తో కలిసి తొలిసారిగా మెగాస్టార్మూవీ ద్వారా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. నేటితో ఈ సినిమాలో ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా మెగాస్టార్, మెగాపవర్ స్టార్ ల పై పలు సన్నివేశాలు తీస్తున్న కొరటాల శివ, నేటితో వాటిని కంప్లీట్ చేసారని, ఇక అతి త్వరలో వారిద్దరితో కలిసి ఒక భారీ మాస్ సాంగ్ ని తీయనున్నారని అంటున్నారు.

మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఒక మాజీ నక్సలైట్ పాత్ర చేస్తున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన అనుచరుడిగా సిద్ద అనే పాత్ర చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవి, చరణ్ కలిసి ఫస్ట్ టైం నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై మెగా అభిమానుల తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా దీనిపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో అదిరిపోయే వ్యూస్ దక్కించుకుని ఆడియన్స్ లో సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసింది. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ఈ మూవీ నుండి మహాశివరాత్రి పండుగ రోజున రామ్ చరణ్ పాత్ర యొక్క ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసేందుకు యునిట్ ముహూర్తం ఫిక్స్ చేసారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. కాగా దీనికి సంబంధించి త్వరలో అధికారిక న్యూస్ కూడా బయటకు రానుందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మెగా ఫ్యాన్స్ కి ఇది మంచి పండుగ వార్త అని చెప్పకతప్పదు. కాగా ఈ సినిమా వేసవి కానుకగా మే 13న రిలీజ్ కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: