రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే..జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సాహో సినిమా ప్లాప్ గా నిలవగా ఆ సినిమా తర్వాత వచ్చే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఆ అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా నుంచి వచ్చిన లుక్స్, టీజర్ కి ప్రేక్షకులు మంచి స్పందన ఇచ్చారు..  యూవీ క్రియేషన్స్ బ్యానర్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా జులై లో ఈ సినిమా ను రిలీజ్ చేస్తుండడం విశేషం..

సినిమా షూటింగ్ సాహో కన్నా ముందే మొదలుపెట్టుకున్న ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ కాలేదు..దాంతో ప్రభాస్ అభిమానులు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో దర్శకుడు చక చక ఈ సినిమా ని పూర్తి చేశాడు. ప్రస్తుతం చివరి దశ జరుపుకుంటున్న ఈ సినిమా కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.. డియర్ కామ్రేడ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన జస్టిన్ ఈ సినిమా తో ఎలా మెప్పిస్తాడా అనేది చూడాలి.. కోవిడ్ నేపథ్యంలో ఈ సినిమా కి అంతరాయం కలుగగా చెప్పిన టైం కి రిలీజ్ చేస్తారా అనేది అనుమానంగా ఉంది..

ఇకపోతే ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సోషల్ మీడియా లో ఈ సినిమా ను టైటానిక్ తో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం చిత్ర బృందానికి ఎంతో సంతోషాన్నిస్తున్నా ఈ సినిమా ఆ రేంజ్ లో ఉంటుందా అనేదే అసలు ప్రశ్న.. ఈ సినిమాలోనూ టైటానిక్ సినిమా మాదిరిగా ఓ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది అని ప్రచారం జరుగుతుంది.. దానికి సంబందించిన వార్త అధికారికంగా వెలువడాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరో మూడు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: