వెన్నెల చిత్రం తో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దుగుమ్మ పార్వతి మెల్టన్. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆమె అందాలు కవ్వించినా గుర్తింపు దక్కించుకోలేకపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా లో ఆమె కు మంచి గుర్తింపు దక్కింది. అయితే అది కూడా ఆమెకు మరిన్ని సినిమాలను తెచ్చి పెట్టలేకపోయింది. మహేష్ బాబు దూకుడు సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ తప్ప ఆమె మరే అవకాశం కూడా దక్కించుకోలేక పోయింది. క్రమక్రమంగా సినిమా అవకాశాలు తగ్గడంతో తన పర్సనల్ లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేసింది.

ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి పోయింది పార్వతి మెల్టన్. తన ఫ్యామిలీ లైఫ్ ఎంతో సరదాగా గడుపుతోంది. తాజాగా తన సినీ ప్రస్థానం కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. ఆమె సినిమా పరిశ్రమలో ఇబ్బందుల గురించి, తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి వెల్లడించింది. తాను సినిమాల్లోకి రావడానికి కారణం టాలీవుడ్ టాప్ దర్శకుడు అని చెప్పింది. అయితే సినిమా రంగంలో ఇద్దరు టాలీవుడ్ దర్శకులు చేసిన మోసం వల్లనే తన కెరీర్ ఇలా అయిందని ఆమె వాపోయింది.

అయితే వారి పేర్లు మాత్రం బయటకు రివీల్ చేయలేదు. ప్రస్తుతం తన భర్తతో కలిసి వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇంతకీ తనను మోసం చేసిన దర్శకులు ఎవరు అనే అంశం పై సోషల్ మీడియాలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఆమె నటించిన ఆఖరి చిత్రం పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన యమహో యమ సినిమా. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగు తెరకు దూరం అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడింది అనే అంశం ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే ఓ ప్రముఖ దర్శకుడు, స్టార్ హీరో వ్యవహారంలో ఈమె పేరు బయటకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: