కార్తీ నటించిన తమిళ సినిమాలు అన్ని తెలుగులో డబ్బింగ్ అయ్యి ఇక్కడ కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలు కూడా చూశాయి. కార్తీక్ - తమన్నా జంటగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఆవారా సినిమా తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువగా ఆడింది. ఈ సినిమాతోనే కార్తీ తెలుగు యువత మదిని దోచుకున్నారు. ఇక ఖాకీ సినిమా అయితే తెలుగు లో స్టార్ హీరోలను సైతం మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్ లో తమన్నా - కార్తీ చేసిన హడావుడితో వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందని ప్రచారం జరిగింది. ఇంకేముంది వీరిద్దరు పెళ్లి కూడా చేసేసుకుంటున్నారని ఒక్కటే వార్తలు వచ్చాయి.
దీనిపై కార్తీ స్పందిస్తూ తాను చిన్నప్పటి నుంచి బాయ్స్ కాలేజీ లో మాత్రమే చదివానని... తమన్నాతో తాను ఒక సినిమా చేసినంత మాత్రాన తమ ఇద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగిందని... అయితే దీన్ని తాను ఎంజాయ్ చేశా అని చెప్పుకొచ్చారు. ఇక కార్తీ తెలుగులో కూడా బాగా మాట్లాడడానికి కారణం చిన్నప్పుడు అక్కడ ఎక్కువ మంది తెలుగు స్నేహితులు ఉండడమే అట. మన తెలుగు నటులు నూతన్ ప్రసాద్ కూడా కార్తీ ఇంటి ముందే ఉండేవారట.