ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ హాట్ బ్యూటీ కి వరుస ఆఫర్లు దక్కాయి. దీనిలో భాగంగా తెలుగు లో ఉన్న దాదాపు స్టార్ హీరోలందరితో నటించి తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగుతోపాటు  తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ పై ఎక్కువ దృష్టి పెట్టింది. అందులో భాగంగానే రకుల్ ప్రీత్ సింగ్ ఒక బాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ప్రస్తుతం షూటింగ్ అడవిలో జరుగుతుంది. అడవిలో షూటింగ్ అంటే అంత ఆషా మాషీ కాదు. అది కూడా రాత్రిపూట అంటే ఇంకా ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచించండి. అలాంటి కష్టాలను కూడా సినిమా మీద ఇష్టంతో రకుల్ ప్రీత్ సింగ్ ఎదుర్కొంటూ ఎంతో శ్రద్ధ తో షూటింగ్ లో పాల్గొంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'డాక్టర్ జి' అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది షూటింగ్ భోపాల్ లోని అడవి ప్రాంతంలో జరుగుతుంది.


షూటింగ్ మధ్య గ్యాప్ లో రకుల్ చాట్ కూడా ఆరగించారు. ఫారెస్ట్ లో షూటింగ్ చేస్తూ చాట్ తింటే ఆ మజానే వేరు అని కూడా అంటున్నారు. లేడీ డైరెక్టర్ అయిన అనుభూతీ కశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ వైద్య విద్యార్థిని ఫాతిమా పాత్రలో కనిపించబోతుంది. డాక్టర్ ఉదయ్ గుప్తా పాత్రలో ఆయుష్మాన్ కనిపిస్తాడు. వీటితో పాటు రకుల్ హిందీలో మేడే, థ్యాంక్‌ గాడ్‌, ఎటాక్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు ఈ ముద్దుగుమ్మ తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న 'ఇండియన్ టు' లో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలతో రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి విజయాలను అందుకుంటుందో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: