అక్కినేని హీరో నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అయ్యింది. సెప్టెంబర్ 24 న ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు.ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అందమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాకి టాలీవుడ్ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకి అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇక ముఖ్యంగా విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్స్ ని క్రియేట్ చేసింది.

ఇక సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఎంతో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది.ఇందుకోసం ఇద్దరు స్టార్ హీరోలు స్పెషల్ గెస్ట్ లుగా రాబోతున్నారు.అందులో ఒకరు మెగాస్టార్ చిరంజీవి.దీంతో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ లో కూడా జోష్ పెరిగిపోయింది.అలాగే మెగాస్టార్ తో పాటు బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ కూడా అక్కినేని నాగ చైతన్య సినిమాకు ముఖ్య అతిథిగా రాబోతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో నాగ చైతన్య ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో చైతూ సినిమాని సపోర్ట్ చేయడానికి అమీర్ ఖాన్ ఈ ప్రిరిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అవుతున్నారు.ఇక లవ్ స్టోరీ సినిమాని ముందుగా సెప్టెంబర్ 10 వినాయక చవితి సంధర్భంగా విడుదల చేయాలని భావించారు. కానీ అదే సమయానికి నాని నటించిన టక్ జగదీష్ సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ ప్రకటించడంతో చిన్న పాటి చర్చలు జరిగాయి. దీంతో లవ్ స్టోరీ నిర్మాతలు వెనక్కి తగ్గి.. ఇప్పుడు సెప్టెంబర్ 24 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.ఇక ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.ఇక ఈ సినిమాతో పాటూ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు చైతూ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: