టాలీవుడ్
సినిమా పరిశ్రమలో కమర్షియల్ సినిమాలలో
కామెడీ ని జొప్పించి స్టార్ హీరోలతో సైతం
కామెడీ చేయించగల దర్శకుడు శ్రీను వైట్ల. ఈ ట్రెండ్ ను మొదలుపెట్టింది దర్శకుడు
శ్రీను వైట్ల అనే చెప్పాలి. కమర్షియల్
సినిమా తెరకెక్కించే వైట్ల ఆయన
సినిమా లలో యాక్షన్ సబ్జెక్టుతో పాటు
కామెడీ కూడా విరివిగా ఉంటుంది. ఆయన
సినిమా కు డబుల్ బొనాంజా అంటూ ఉంటారు. అందుకే ఆయనకు
సక్సెస్ రేటు ఎక్కువ. మొదటి నుంచి తన సినిమాల్లో హాస్యం కూడా ఎక్కువగా ఉండే విధంగా చూసుకునేవారు.
సినిమా లో ఎంత మంది హాస్య నటులు ఉన్నా కూడా
హీరో కూడా
కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తాడు. పెద్ద పెద్ద హీరోలు సైతం పొట్ట చెక్కలు అయ్యే విధంగా నవ్విస్తూ హాస్యం పండించడం ఒక్క శ్రీనువైట్ల
సినిమా లోనే చూస్తుంటాం. తెలుగు హీరోలు తప్పకుండా ఈ దర్శకుడితో
సినిమా చేయాలని భావిస్తూ ఉంటారు. అలాంటి
శ్రీను వైట్ల గత కొన్ని సినిమాలుగా భారీ ఫ్లాప్ లు అందుకుని ప్రేక్షకులను నిరాశ పరచడంతో ఇప్పుడు ఆయన వెనుక పడిపోయారు.ఇప్పుడు ఏ
హీరో కూడా
శ్రీను వైట్ల తో
సినిమా చేయడానికి సిద్ధంగా లేరు. ఆయన టైం అయిపోయింది అని కొందరు అంటుంటే ఆయన మాత్రం మళ్ళీ కంబ్యాక్ చేయాలని చూస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే మంచు విష్ణుతో ఢీ అండ్ ఢీ అనే సినిమాను చేస్తున్నాడు శ్రీను వైట్ల. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఢీ అనే
సినిమా రాగా అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి మళ్లీ పూర్వ వైభవం చేయాలని చూస్తున్నాడు. ఇక తాజాగా ఆయన మరో ఒక హీరోతో కూడా
సినిమా చేస్తున్నాడు అని చెప్పి అందరికీ షాకిచ్చాడు. గతంలో రెడీ అనే
సినిమా చేసిన
హీరో రామ్ తో తాను మరొక
సినిమా చేయబోతున్నాడని ఆయన వెల్లడించారు. మరి ఈ
సినిమా ఆయన ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి. మంచు విష్ణు తో చేస్తున్న d&d
సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.