ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎక్కువగా ఎదురుచూస్తున్నది rrr సినిమా కోసమే. ఇక ఈ చిత్రం కోసం అభిమానులు కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ ఏడాది ఈ నెల 25వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక సరికొత్త జీవో తీసుకురావడం జరిగింది. దీంతో ఈ చిత్ర బృందం కాస్త బయట పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో మొత్తం ఎన్ని కోట్లకు బిజినెస్ జరిగింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.


మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా రెండు వందల కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. నిజాం లో రూ. 70 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరగగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే రూ. 95 కోట్ల వరకు బిజినెస్ పెరిగినట్లు సమాచారం ఇక విషయానికి వస్తే రూ.35 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే బిజినెస్ రూ.200 కోట్లకు పైగానే ఈ సినిమా అమ్ముడుపోయినట్లు సమాచారం. నిర్మాతలు 350 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించాలని వార్తలు వినిపిస్తున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమా రూ. 200 కోట్లు రాబట్టింది అంటే ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీసు వద్ద  కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.


ఇకపోతే ఈ సినిమాలో ఆలియా భట్ మొదటిసారి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి రావడం గమనార్హం . ఇక ఈ సినిమా కోసం ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా పారితోషికం అందుకుంటుంది. ఇక ఇద్దరు హీరోలు కూడా సమానంగా 45 కోట్ల రూపాయల పారితోషకం అందుకోగా .. రాజమౌళి మాత్రం ఈ సినిమా లాభాలలో 30 శాతం వాటా అడిగినట్లు అలాగే రూ.24 కోట్ల రెమ్యూనరేషన్ తో కలిపి ఆయన తీసుకోబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: