ఈ సినిమాలో అడవిశేషు సరసన హీరోయిన్గా సాయి మంజ్రేకర్ నటిస్తోంది. కాకుండా ఇందులో కీలకమైన పాత్రలో శోభితా ధూళిపళి,రేవతి, మురళి శర్మ నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ -3 న తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను కూడా గత కొద్ది రోజుల క్రిందట విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ మేజర్ ప్రాజెక్టు వ్యవహారాన్ని దగ్గరుండి కేవలం నమ్రత చూసుకోవడం జరుగుతోందని తెలియజేశారు. కేవలం ఆ క్రెడిట్ అంతా తనకే వెళ్తుందని తనకు రాదు అని తెలియజేశాడు.
ఈ సినిమా కూడా కోవిడ్ కారణంగా, షూటింగ్ పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు తీసుకు వచ్చామని తెలియజేశాడు. ఇక నేను కూడా సాధారణ ప్రేక్షకుడిగా ఏ చిత్రాన్ని అయిన చూసి ఎంజాయ్ చేయగలను అని తెలిపాడు మహేష్ బాబు. లాక్ డాన్ సమయంలో ఈ చిత్రానికి ఓటిటి సంస్థల నుండి భారీ ఆఫర్లు వచ్చాయి కానీ థియేటర్ లో చూడదగిన సినిమా అని వాటికి రెస్పాన్స్ కాలేదని తెలియజేశారు. అందుచేతనే ఈ సినిమాని థియేటర్ లోనే విడుదల చేస్తున్నామని తెలియజేశారు మహేష్ బాబు. ఇక తను నటించిన సర్కార్ వారి పాట చిత్రం ఈ నెల 12న విడుదల కాబోతోంది అని తెలిపారు.