మహేష్ తన సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని వాటిలో కూడా విజయం దిశగా దూసుకు పోతున్నాడు. తాను హీరోగా చేస్తున్న ప్రాజెక్టులలో భాగస్వామి గా మారడమే కాకుండా ఇతర హీరోలతో కూడా కొన్ని చిత్రాలను నిర్మిస్తూ మహేష్ విజయాలు అందుకుంటూ ఉన్నాడు. అడవి శేషు హీరోగా మహేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం మేజర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శశికిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది.

ఈ సినిమాలో అడవిశేషు సరసన హీరోయిన్గా సాయి మంజ్రేకర్ నటిస్తోంది. కాకుండా ఇందులో కీలకమైన పాత్రలో శోభితా ధూళిపళి,రేవతి, మురళి శర్మ నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ -3 న తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను కూడా గత కొద్ది రోజుల క్రిందట విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ మేజర్ ప్రాజెక్టు వ్యవహారాన్ని దగ్గరుండి కేవలం నమ్రత చూసుకోవడం జరుగుతోందని తెలియజేశారు. కేవలం ఆ క్రెడిట్ అంతా తనకే వెళ్తుందని తనకు రాదు అని తెలియజేశాడు.

సినిమా కూడా కోవిడ్ కారణంగా, షూటింగ్ పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు తీసుకు వచ్చామని తెలియజేశాడు. ఇక నేను కూడా సాధారణ ప్రేక్షకుడిగా ఏ చిత్రాన్ని అయిన చూసి ఎంజాయ్ చేయగలను అని తెలిపాడు మహేష్ బాబు. లాక్ డాన్ సమయంలో ఈ చిత్రానికి ఓటిటి సంస్థల నుండి భారీ ఆఫర్లు వచ్చాయి కానీ థియేటర్ లో చూడదగిన సినిమా అని వాటికి రెస్పాన్స్ కాలేదని తెలియజేశారు. అందుచేతనే ఈ సినిమాని థియేటర్ లోనే విడుదల చేస్తున్నామని తెలియజేశారు మహేష్ బాబు. ఇక తను నటించిన సర్కార్ వారి పాట చిత్రం ఈ నెల 12న విడుదల కాబోతోంది అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: