మెగా హీరో వరుణ్ తేజ హీరోగా వచ్చిన ముకుంద సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే.ఇక ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు వచ్చినప్పటికీ ఒక హిట్టు కూడా ఈ అమ్మడు ఖాతా లో పడలేదు. అయితే దాంతో టాలీవుడ్ లో తన లక్కు బాగాలేదని బాలీవుడ్ కి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.కానీ  ఇక మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం అనే సినిమాతో మొదటి హిట్ని తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే  అప్పటినుండి తన ఖాతాలో వరుస హిట్లు పడ్డాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఐరన్ లెగ్ అనే పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్

 ఆ తర్వాత వరస విజయాలతో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. అయితే  ఇక ఈ ఏడాది ఈమె నటించిన వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో మళ్లీ ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.  వరుస డిజాస్టర్ల లో ఉన్న పూజా హెగ్డే తన ఆశలన్నీ మహేష్ బాబు తో నటించే సినిమా పైనే పెట్టుకుంది.ఈ సినిమా ఏ ముహూర్తానా అనుకున్నారో కానీ ఈ సినిమా షూటింగ్ కి అస్సలు కలిసి రావడం లేదు.  అయితే వాస్తవానికి ఈ సినిమా పూజా కార్యక్రమాలు చేసే టైంలో మహేష్ బాబుకి కరోనా వచ్చింది. ఇక ఆ తర్వాత పూజ హెగ్డే కాలికి గాయమైంది. మరికొన్ని రోజులకు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి చనిపోయింది.

 ఇప్పుడేమో మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు చనిపోయారు. ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ కావలసింది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇప్పుడు సినిమా తెరకెక్కించే టైం కి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది.  ఇన్ని రోజులు పూజ హెగ్డే కాలి కి గాయం అవ్వడం వల్ల షూటింగ్ జరగలేదు.ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. పూజ హెగ్డే కాలికి అయిన గాయం తిరగబడినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ హీరోయిన్ కాలి గాయం పూర్తిగా నయం కావాలంటే ఇంకా మూడు నెలల సమయం పడుతుందట అంతేకాదు ఒకవేళ పూజ హెగ్డే నిర్లక్ష్యం చూపిస్తే మాత్రం కచ్చితంగా ఆమె వీల్ చైర్ కి పరిమితం కాకా తప్పదు అంటున్నారాట డాక్టర్లు. మూడు నెలల తర్వాత కూడా పూజ హెగ్డే తన కాలి మీద ఎక్కువగా ఒత్తిడి పెట్టకూడదట. అంతేకాదు అలాగే కాలిని ఇబ్బంది పెట్టే బలమైన స్టెప్స్ వేయకూడదట. అయితే  ఇక ఈ విషయంలో ఇక పూజ హెగ్డే డాన్స్ చేయడానికి పనికిరాదా అంటూ నెటిజెన్లు బాధపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: