తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నిఖిల్ తాజాగా 18 పేజెస్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం "నన్నయ్య రాసిన" అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది. ఈ వీడియో సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందించాడు. ప్రస్తుతం గోపి సుందర సంగీత సారథ్యంలో తెరకెక్కిన నన్నయ రాసిన సాంగ్ యూట్యూబ్ లో ఫుల్ జోష్ లో దూసుకుపోతోంది. ఈ మూవీ కి పల్నాటి వీర ప్రతాప్ దర్శకత్వం వహించాడు. 

ఇది ఇలా ఉంటే తాజాగా నిఖిల్ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం సాధించి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను సాధించడంతో నిఖిల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అలా నిఖిల్ క్రేజ్  "కార్తికేయ 2" మూవీ తో ఫుల్ గా పెరిగి పోవడం , కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన నిఖిల్ హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ మరో సారి ఈ మూవీ తో ప్రేక్షకులను అలరించ డానికి రెడీ గా ఉండడం తో ఈ మూవీ పై ప్రేక్షకులలో అంచనాలు భారీ గా పెరిగిపోయాయి.  మరి 18 పేజెస్ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: