టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ను కలిగి ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి నిఖిల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ తాజాగా కార్తికేయ 2 అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా , చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. కార్తికేయ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో మొదటి నుండే ఈ మూవీ పై తెలుగు సినీ అని ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల ఆయన కార్తికేయ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లు కూడా దక్కాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకుంది. ఇలా థియేటర్ ప్రేక్షకులను మరియు "ఓ టి టి" ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కార్తికేయ 2 మూవీ కొన్ని రోజుల క్రితమే బుల్లి తెర పై కూడా ప్రసారం అయింది.

మూవీ సాటిలైట్ హక్కులను జి సంస్థ దక్కించుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను జీ తెలుగు లో జీ సంస్థ ప్రచారం చేసింది. మొదటి సారి ఈ సినిమా బుల్లి తెర పై ప్రసారం అయినప్పుడు 7.88 "టి ఆర్ పి" ని సొంతం చేసుకుంది. కార్తికేయ 2 మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇలా ఈ సినిమా థియేటర్ ప్రేక్షకులను "ఓ టి టి" ప్రేక్షకులను తాజాగా బుల్లితెర ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: