
తాజాగా ఈ నటి మెటర్నిటీ షూట్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. కాగా విదిషా టాలీవుడ్ తో పాటు కన్నడ, తమిళ మరియు మలయాళ చిత్రాల్లో నటించింది. మా ఇద్దరి మధ్య అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అలా, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ అలాగే దేవరాయ సినిమాలలో నటించింది. ఓకే ఏడాది లో తెలుగులో ఆమె నటించిన మూడు చిత్రాలు విడుదల అయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిట్ మూవీ జనతా గ్యారేజ్ సినిమా లో విదిషా శ్రీవాస్తవ ముఖ్య పాత్రలో కనిపించింది. ఈ చిత్రం లో రియా పాత్రలో ఆమె మెప్పించింది. ఇకపోతే విదిషా శ్రీవాస్తవ 2018 డిసెంబర్లో సాయక్ పాల్ను పెళ్లి చేసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన విదిషా డెలివరీ తర్వాత ముంబయి కి వెళ్లనున్నట్లు తెలిపింది. కాగా తాజాగా తాను షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడంతో అభిమానులు కూడా ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. అలాగే పలువురు సెలబ్రెటీలు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు సమాచారం.