
ఈ సినిమాకి డి.వి.నరసరాజు కథని అందించారు. ఈ మూవీ స్క్రిప్ట్ రాస్తున్న సమయంలో నరసరాజుకి ఒక ఆలోచన వచ్చింది. 1977 లోనే ఎన్టీఆర్ 'దాన వీర శూర కర్ణ' మూవీలో బాలకృష్ణ అభిమన్యుడి పాత్రలో నటించి ఆడియన్స్ ని మెప్పించాడు. ఇక యమగోల స్క్రిప్ట్ రాస్తున్న సమయంలో నరసరాజుకి.. యమగోలలో బాలయ్యని కథానాయకుడిగా, ఎన్టీఆర్ ని యముడిగా చూపిస్తే బాగుంటుంది అనిపించిందట. దీంతో ఆ ఆలోచన దృష్టిలో పెట్టుకొనే ఆ సినిమా స్క్రిప్ట్ ని రాశారట.ఇక ఈ విషయాన్ని ఆ మూవీ నిర్మాత ఎస్.వెంకటరత్నంకి తెలియజేసి.. రామారావుని అడగమని చెప్పారు. ఎన్టీఆర్ కి కథని వినిపించిన తరువాత అసలు విషయం చెప్పారు. కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్.. బాలయ్య హీరోగా మాత్రం ఒప్పుకోలేదు. దానికి కారణం బయట నిర్మాణ సంస్థ కావడం. బాలయ్య చదువుకి ఇబ్బంది అవుతుందని, లేదా బాలయ్య చదువు వల్ల నిర్మాతలు ఇబ్బంది పడడమో జరుగుతుందని ఎన్టీఆర్ నిరాకరించారు. ఒకవేళ అప్పుడు ఒకే చెప్పి ఉంటే.. నందమూరి అభిమానులకు మరో మంచి మల్టీస్టారర్ వచ్చేది.