ఈ మధ్య కాలం లో చాలా మంది సినీ సెలెబ్రిటీలు ఓవైపు సినిమా ల్లో సక్సెస్ అవుతూనే మరోవైపు రాజకీయా ల్లో కూడా రాణిస్తున్నారు. కేవలం సీనియర్ నటినటులు మాత్రమే కాకుండా యంగ్ హీరో హీరోయిన్స్ కూడా రాజకీయా ల్లోకి రావడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు.అయితే తాజా గా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ కూడా పాలిటిక్స్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వ బోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చాలా రోజుల నుండి శృతి హాసన్ రాజకీయాల్లో కి రంగ ప్రవేశం చేయ బోతుంది అంటూ వార్తలు వినిపించినప్పటికీ అందు లో ఏది నిజం కాలేదు అయితే మరోసారి శృతి హాసన్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది అని వార్తలు కుప్పలు తెప్పలు గా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల గురించి తాజా గా కోయం బత్తూర్ మీడియా తో మాట్లాడుతూ శృతిహాసన్ ఆసక్తికర కామెంట్లు చేసింది.

శృతిహాసన్ కోయంబత్తూర్ మీడియా తో మాట్లాడుతూ.. చాలా రోజుల నుండి నేను రాజకీయాల్లో కి వస్తున్నాను అంటూ ప్రచారం చేస్తున్నారు.అయితే నేను రాజకీయాల్లో కి వస్తున్నాను అనే ప్రచారం లో ఎలాంటి నిజం లేదు.ప్రస్తుతం నేను సినిమా ల్లో ఫుల్ బిజీ గా ఉన్నాను.   అలాగే నాకు పాలిటిక్స్ అంటే కూడా అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. రాజకీయాల్లోకి రావాలనే కోరిక కూడా నాకు లేదు.సినిమా ల్లోనే స్టార్ గా రాణించాలి అనుకుంటున్నాను.. అంటూ శృతి హాసన్ తన రాజకీయ ఎంట్రీ గురించి వస్తున్న ప్రచారాల పై క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం శృతి హాసన్హాలీవుడ్ మూవీ తో పాటు తెలుగు,హిందీ, తమిళ భాషల్లో బిజీ బిజీ గా ఉంది.ఇక ఈమె పాన్ ఇండియా మూవీ అయినా సలార్  లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: