బాలీవుడ్ యువ నటుడు రన్బీర్ కపూర్ హీరోగా ... టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా డిసెంబర్ 1 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ ఇప్పటి వరకు నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి మొత్తం గా 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 23.05 కోట్ల షేర్ ... 44.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే 8.05 కోట్ల షేర్ కలెక్షన్ లను ఎక్కువగా రాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలను అందుకునే అవకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: