ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కొండేటి ఆధ్వర్యంలో గోవాలో జరిగిన సంతోషం ఫిలిం అవార్డ్స్ ఘటనపై నిన్న అల్లు అరవింద్ మీడియా వేదిక స్పందించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇదే వివాదంపై జర్నలిస్ట్ ఫిలిం నగర్ కల్చరర్ సెంటర్, తెలుగు ఫిలిం అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సురేష్ కొన్ని ఉద్దేశించి జరిగిన తప్పులను స్పష్టంగా వివరిస్తూ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పేరుతో ఒక లేఖను విలేకరుల సంఘానికి పంపింది. ఈ లేఖలో ఏముందంటే.. డిసెంబర్ 3 గోవాలో జరిగిన 23వ సంతోషం అవార్డుల ఫంక్షన్ కు తెలుగు సినీ పరిశ్రమ పేరు చెప్పి అనుమతులు తీసుకున్నారు.

 ఎన్నో కంపెనీలు, వ్యక్తులు ఇందులో స్పాన్సర్ చేసేందుకు భాగమయ్యారు. టాలీవుడ్ బ్రాండ్ మీదే ఇదంతా జరిగింది. అయితే స్థానికంగా ఉండే సంఘాలతో సమన్వయం చేసుకోకుండా వేడుకకు పని చేసిన వాళ్లకు డబ్బులు చెల్లించడంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల తీవ్ర పరిణామాలు తలెత్తాయి. క్యాబ్ డ్రైవర్లకు కూడా అద్దెలు చెల్లించకపోవడం సమస్యను మరింత తీవ్రం చేసింది. ఎంతోమంది సెలబ్రిటీలు అసౌకర్యానికి గురయ్యారు. కొంతమంది ఆర్టిస్టులు, నిర్మాతలు, దర్శకులకు హోటల్ లో ప్రవేశించడానికి అనుమతి దొరకలేదు. అందుకు కారణం అక్కడ చెల్లించాల్సిన బాకీలు ఇంకా ఉండడమే.

 అల్లు అరవింద్ తో పాటు దామోదర్ ప్రసాద్ దీన్ని పరిష్కరించగలిగారు. మూడో తేదీ రాత్రి ఒంటిగంటకు హోటల్ రూమ్స్ కు బయలుదేరిన ఆర్టిస్టులను డ్రైవర్లు అడ్డుకున్నారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మొదలవ్వాల్సిన ఈవెంట్.. ఏర్పాట్లలో అలసత్వం, ఆర్థిక వ్యవహారాల వల్ల రాత్రి ఎనిమిది గంటలకు స్టార్ట్ అయింది. గంట తర్వాత అల్లు అరవింద్ వేదిక మీద ఉండగానే సప్లయర్స్ పవర్ కట్ చేశారు. తిరిగి పునరుద్ధరించే సమయానికి సురేష్ నాలుగో తేదీ తెల్లవారుజామునే ఫ్లైట్లో హైదరాబాద్ కి వెళ్ళిపోయారు. ఫోన్ తీయడం లేదు. దీనివల్ల గోవా ప్రభుత్వంలో చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఏర్పడింది. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోగలరు.. అంటూ ఆ లేఖలో రాసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: