మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. జక్కన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా దయ వల్ల రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగింది.ముఖ్యంగా ఈ మూవీలో అల్లూరి సీతారామారాజు పాత్రలో చెర్రీ నటనకు భారతీయులు, హాలీవుడ్ మేకర్స్, విదేశీయులు ఎంతగానో ముగ్దులయ్యారు.హాలీవుడ్ డైరెక్టర్స్ స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరాన్ లాంటి దిగ్గజాలు తారక్, చరణ్ నటన ఇంకా రాజమౌళి టేకింగ్ చూసి ఫిదా అయ్యారు. దీంతో వీరి పేర్లు వరల్డ్ వైడ్ గా మారుమోగాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో తమ నటనకు గానూ ఇప్పటికే ఎన్నో అవార్డ్ లు అందుకున్నారు. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‏కు మరో అరుదైన గౌరవం దక్కింది. చరణ్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చి చేరింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్..మన ఇండియా సెలబ్రెటీలకు కూడా ఇస్తుంటారు. గతంలో బాలీవుడ్ స్టార్లకు మాత్రమే ఈ అవార్డ్స్ వచ్చాయి. షారుఖ్, దీపికా పదుకొణెలకు అవార్డ్స్ రాగా.. ఈసారి రామ్ చరణ్ కూడా చోటు దక్కించుకున్నారు.


ఈ ఏడాది ఈ అవార్డ్స్ కోసం రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, ఆదా శర్మ, దీపికా పదుకొనే వంటి వారు చోటు దక్కించుకున్నారు.తాజాగా వారు పాప్ గోల్టెన్ అవార్డ్స్ ప్రకటించారు. ఇక ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్ కు ఈ అవార్డ్ దక్కింది. దీంతో ఇప్పుడు మెగా పవర్ స్టార్ పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఆయన సీనియర్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు.ఇందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ కాగా.. తెలుగు సీనియర్ నటుడు శ్రీకాంత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది  ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: