ఈ మధ్యకాలంలో ప్రభాస్ కి సంబంధించిన ప్రతి వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రెబెల్ ఫ్యాన్స్ కి కడుపు మండిపోయేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రభాస్ అభిమానులకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. సాధారణంగా ప్రభాస్ సినిమా వస్తుంది అంటే కచ్చితంగా ఫ్యాన్స్ దాని గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు . ప్రభాస్ రేంజ్ అలాంటిది . అయితే ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అని ప్రభాస్ ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండి ఉంటే బెటర్ గా ఉండేది అని రెబెల్ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు .


ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దదే . దాదాపు ఐదేళ్లపాటు కాల్ షీట్స్ మొత్తం ఫిల్ అయిపోయాయి . మారుతి దర్శకత్వంలో రాజా సాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ .. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో స్పిరిట్  .. మరొకపక్క సలార్ 2.. కల్కి 2 ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో ప్రాజెక్ట్ లు వస్తూనే ఉంటాయి.  అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది.  ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాలో నటించబోతున్నాడు అంటూ న్యూస్ బయటకు వచ్చింది .


హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ స్టార్ డం అమాంతం పెరిగిపోయింది . ఇప్పుడు పాన్ ఇండియా స్టార్సే  ఆయన టార్గెట్.  కాగా ప్రశాంత్ వర్మ - ప్రభాస్ కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్గా ఒక ఫ్లాప్ బ్యూటీని తీసుకోవడం ఫ్యాన్స్ కి కడుపు మండిపోయేలా చేస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్గా మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించిన భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్గా చూస్ చేసుకున్నారట ప్రశాంత్ వర్మ.  ప్రభాస్ కూడా అందుకు ఓకే చేశారట . భాగ్యశ్రీ కు అసలు హిట్సే లేవు . మరి అలాంటి హీరోయిన్ ని ఎలా చూస్ చేసుకుంటారు ..? అది కూడా పాన్ ఇండియా రేంజ్ ఉన్న ప్రభాస్ సినిమాలో అంటూ ఫైర్ అవుతున్నారు అభిమానులు . ప్రభాస్ అయినా చెప్పాలిగా అంటూ ప్రభాస్ పై కూడా నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు . ప్రభాస్ తీసుకున్న నిర్ణయం అభిమానులు కడుపు మండిపోయేలా చేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: