
వీళ్ళ కాంబోలో వచ్చిన వచ్చిన సినిమాలు బాగా హిట్ అవుతాయి . పాజిటివ్ టాక్ రాకపోయినా పర్ఫామెన్స్ పై మాత్రం మంచి రివ్యూస్ వస్తూ ఉంటాయి. కాగా చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు తెర పై మెరవబోతుందు నయనతార అంటూ ఓ న్యూస్ హైలెట్గా మారింది . నయనతార - అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబోలో ఓ సినిమాను ఓకే చేసిందట. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక తెలుగు సినిమాని సైన్ చేసింది నాయనతార . అయితే ఇప్పుడు నయనతార మరొక తెలుగు సినిమాని కూడా ఓకే చేసిందట .
బాలకృష్ణ - నయనతార అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . ఇప్పుడు ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది. అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబో సినిమాకు ఎప్పుడైతే కాల్ షీట్స్ అడిగారో అదే మూమెంట్లో బాలయ్య - క్రిష్ కూడా కాల్ షీట్స్ అడుగుతున్నారట . దీంతో ఏ ఆఫర్ ని రిజెక్ట్ చేయలేక నయనతార ఇబ్బందులు పడుతుందట. ఒకరోజు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే మూవీకి కాల్ షీట్స్ ఇస్తే వెంటనే ఆ పక్క రోజు క్రిష్- బాలయ్య కాంబో సినిమాకి కాల్ షీట్స్ ఇవ్వాల్సిన పొజిషన్ వచ్చినట్లు తెలుస్తుంది . దీంతో ఇప్పుడు నయనతార టాప్ హీరోలైన బాలకృష్ణ - చిరంజీవి మధ్య నలిగిపోతుందంటున్నారు జనాలు . చూడాలి మరి ఈ టఫ్ సిచువేషన్ నుంచి నయనతార ఎలా బయటపడుతుంది అనేది..!?