ధనుష్ హీరోగా నాగార్జున , రష్మిక కీలక పాత్రలో నటించిన టాలీవుడ్ మూవీ కుబేర కి యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ వస్తుంది .. 3. రేటింగ్ కి తగ్గకుండా రివ్యూలు వచ్చాయి .. ఈ మధ్య కాలంలో ఇంతలా విమర్శకుల మెప్పు పొందిన‌ సినిమా ఒక్క కుబేర మాత్రమే .. అయితే ఇక్కడ ఈ సినిమా విషయంలో అందరిదీ ఒకటే విమర్శ .. సినిమా నిడివి ఎక్కువైపోయింది .. ఎడిటింగ్ లో ఇంకాస్త ప‌దును చేసి ఉంటే బాగుండు అని విమర్శ అందరిలో వినిపించింది .. అయితే ఇదే విషయాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల దగ్గర ప్రస్తావిస్తే .. అయినా ఓ ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పుకొచ్చారు .. లెంత్‌ విషయం లో తగ్గేదేలే అన్న భావన ఆయన మాటల్లో కరెక్ట్ గా కనిపించింది .

కుబేర కి లెంత్‌ ఎక్కువైందని విమర్శ విన్నాను .. నిజానికి లెంత్ గురించి ఒక దర్శకుడికి , టీం కి తెలియకుండా ఉండదు .. కానీ ఇది చెప్పాల్సిన విషయం .. కచ్చితంగా చెప్పి తీరాలి .. ఒక పాయింట్ ను నిజాయితీగా చెప్పటమే మాకున్న ధర్మం .. అందులో చాలా లేయర్స్ చెప్పడానికి ఎంతో ప్రయత్నించాను .. ఆ క్రమంలోనే కాస్త లెంత్ పెరిగి ఉండవచ్చు .. అయితే ఈ సినిమా మీరు మరోసారి చూసినప్పుడు మీకు తెలియని లేయర్స్ కొత్తగా కనిపిస్తాయి అంటూ శేఖర్ చెప్పుకొచ్చారు .. అదే విధంగా కుబేరని తన కెరీర్ లోనే ట్రూ ఫిల్ జాబితాలో చేర్చారు .. అలాగే నేను చేసిన సినిమాల్లో కుబేర వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ , హానెస్ట్ , ట్రూ ఫిలిం .. అలాగే ఈ సినిమాకి వచ్చిన యునానిమస్ రిపోర్ట్స్ తో నాకు ఎంతో ఆనందంగా ఉంది అని తన ఆనందాన్ని పంచుకున్నారు శేఖర్ కమ్ముల ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: