ఆయన నటుడిగా ఎంత గొప్పవారైనా, ఒక సందర్భంలో సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ తో గొడవ చోటుచేసుకుంది. ఖడ్గం సినిమా విడుదలైన సమయంలో కృష్ణవంశీ, “తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత ఉంది” అన్న మాటలు కోట గారిని తీవ్రంగా బాధించాయి. అయన మాట్లాడుతూ –  “మీరు అవకాశాలిస్తే నే మనవాళ్లు మెరుస్తారు . లేకపోతే ప్రకాశ్ రాజ్‌లాంటి వాళ్లే సెట్ అవుతారు” అని ఘాటు గా స్పందించారు. అంతటితో ఆగకుండా – “మీ సినిమా లో నన్ను పెట్టండి .. నేనేమిటో చూపిస్తా !” అని సవాలు విసిరారు .ఈ మాటల పై కృష్ణవంశీ కూడా స్పందించడం తో వివాదం ముదిరింది. అయితే ఇద్దరి మధ్య గొడవను సినీ పెద్దలు పరిష్కరించారు.


విరోధం నుంచి అనురాగానికి – ‘రాఖీ’ మూవీ తో స్మృతుల మార్పు : వివాదం అనంతరం కృష్ణవంశీ ‘రాఖీ’ చిత్రంలో కోట గారికి మంచి పాత్ర ఇచ్చారు – హీరో తాత పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. ఈ పాత్రలో ఆయన ఎమోషన్, హ్యూమర్, డైలాగ్ డెలివరీ - అన్నింటిలోనూ మళ్లీ తన ఘనతను చూపించారు. అనంతరం ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ, “అప్పుడు తప్పు నాదే .. కోట గారిని అలా తక్కువ అంచనా వేయడం నా అహంకారానికి నిదర్శనం” అని అన్నారు. ఇదే తరహాలో కోట గారు కూడా, “మనవాళ్లను తక్కువ చేస్తే తాను ఊరుకోనన్నారు .. అందుకే స్పందించాల్సి వచ్చింది” అన్నారు.



ఇది కేవలం గొడవ కాదేగానీ – నటనపై గౌరవానికి నిలువెత్తు గుర్తింపు ..ఈ సంఘటనలో ఎవరి గొడవకన్నా ఎక్కువగా వెలుగులోకి వచ్చిందీ – నటన పట్ల క‌ల గౌరవం. కోట గారి మాటల వెనుక ఆవేశం కన్నా తెలుగు నటుల ప్రతిభను నిలబెట్టాలన్న బాధ ఎక్కువగా ఉంది. కోట శ్రీనివాసరావు గారు ఈ లోకాన్ని విడిచిపోయినా, ఆయన పాత్రలు, డైలాగ్స్, వెర్షటైలిటీ – అన్నీ తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. వివాదంలోనూ గౌరవం నిలబెట్టుకున్న ఈ నటన గజదొంగకు భవదీయమైన నివాళులు.

మరింత సమాచారం తెలుసుకోండి: