
ఈ సినిమా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది . హ్యూజ్ ట్రోల్లింగ్ కూడా ఫేస్ చేసాడు మహేష్ బాబు. కాగా ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలి అంటూ భీష్మించుకొని మరి రాజమౌళి సినిమాకు కమిట్ అయ్యాడు మహేష్ బాబు . అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది . అప్పటివరకు తెరపై మహేష్ బాబును చూడకుండా అభిమానులు ఉండలేరు. ఈ క్రమంలోనే ఓ సినిమాలో మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నాడు అన్న వార్త బాగా ట్రెండ్ అయ్యింది.
అదేంటో కాదు ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్. ఈ సినిమాలో ఆయన స్పెషల్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో పాటు ఒక రెండు నిమిషాల పాటు స్పెషల్ క్యారెక్టర్ లో మెరవబోతున్నాడు అన్న న్యూస్ బాగా ట్రెండ్ అయింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ క్యారెక్టర్ ఇక లేదు అంటూ తెలుస్తుంది . వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఓకే చేసిన మహేష్ బాబు సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో మెరవడానికి ఒప్పుకోలేదట . రాజమౌళి సినిమా లుక్స్ ముందుగానే లీక్ అయిపోతాయి అన్న కారణంగానే ఈ విధంగా చేశాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో మహేష్ బాబు అభిమానులకు బ్యాడ్ న్యూస్ వినాల్సిన పరిస్థితి వచ్చింది . మహేష్ బాబును తెరపై చూడాలి అంటే దాదాపు మూడు సంవత్సరాలు పాటు ఆగాల్సిందే అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???