నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2’ సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈసారి బాలయ్య నటించిన చిత్రం తొలిసారిగా పాన్–ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. దీంతో తెలుగు రాష్ట్రాలకే కాకుండా, నార్త్ ఇండియా సినీ వర్గాల్లో కూడా ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు చిత్రంపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి.ఇక సినిమా విడుదలకు ఒకరోజు ముందే, అంటే డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. బాలయ్య సినిమాలకు ఉన్న క్రేజ్ కారణంగా ఈ ప్రీమియర్ షోల టికెట్లకూ భారీ డిమాండ్ నెలకొన్నట్టు తెలుస్తోంది.ఈ మధ్య కాలలో ఏ సినిమా విడుదలైనా టికెట్ రేట్లను పెంచడం సర్వసాధారణమైపోయింది. అదే క్రమంలో ‘అఖండ 2’ కి కూడా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం.


టికెట్ రేట్ల పెంపు వివరాలు:
తెలంగాణలో:

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలకు ₹50 పెంపు

మల్టీప్లెక్స్ థియేటర్లలో ₹100 పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో:

సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధరలకు ₹75 పెంపు

మల్టీప్లెక్స్‌లలో ₹100 పెంపు

ఈ పెంపుకు సంబంధించిన అధికారిక జీవో త్వరలో విడుదల అవ్వనుంది. దీంతో అఖండ 2 రిలీజ్ రోజున థియేటర్లలో భారీ ఆదాయం నమోదయ్యే అవకాశం ఉంది.అలాగే డిసెంబర్ 4వ తేదీ ప్రీమియర్ షోల విషయానికి వస్తే, వాటి కోసం నిర్ణయించిన టికెట్ ధరలు ₹600 వరకు ఉండనున్నాయని సమాచారం. ఈ రేట్స్ చూసి నందమూరి అభిమానులు వెరీ రీజనబుల్ అంటున్నారు.  బాలయ్య ద్విపాత్రాభినయం, బోయపాటి శ్రీను దర్శకత్వం, ధమన్   సంగీతం—అన్నీ కలిసి ఈ సినిమాను మరింత గ్రాండ్‌గా మార్చనున్నాయి.ఇక విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో హైప్ మరింత పెరుగుతోంది. ట్రైలర్, పాటలు, ప్రమోషన్లు—ఒక్కొక్కటి సినిమాపై భారీ బజ్‌ను సృష్టిస్తున్నాయి. పాన్-ఇండియా రిలీజ్ కావడంతో బాలయ్య ఈసారి నార్త్ ప్రేక్షకులను ఎంతవరుకు ఆకట్టుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: