యాత్ర సినిమాలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకున్న మమ్ముట్టి, ఆ తర్వాత యాత్ర 2 సినిమాలో కూడా నటించారు. యాత్ర సినిమా మంచి విజయాన్ని అందుకోగా యాత్ర 2 మాత్రం పెద్దగా ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయింది. కానీ ఇప్పుడు తాజాగా పాదయాత్ర అనే పేరుతో ఒక సినిమా ప్రకటించడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి పాదయాత్ర 2027లో చేయబోతున్నానని చెప్పడంతో ఆ తర్వాత ఈ సినిమా పోస్టర్ రావడంతో ఈ సినిమా పైన క్యూరియాసిటీ పెరిగిపోయింది.
అలా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాను చెప్పడం,మమ్ముట్టి పాదయాత్ర పేరుతో సినిమా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ సినిమా తెలుగు సినిమా లేకపోతే మలయాళ సినిమా అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఈ చిత్రాన్ని మలయాళ దర్శకుడు తెరకెక్కించడంతో మలయాళ సినిమా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఏపీ రాజకీయాలకు ఎటువంటి సంబంధం ఉండదనే విధంగా వినిపిస్తున్నాయి. మరి ఈ పాదయాత్ర సినిమా ఎవరిది? అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి