
ఘటన గురించి తెలిసిన తర్వాత ఇది నిజమా అబద్దమా అని ఎవరు నమ్మలేకుండా పోతున్నారూ అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. సాదరణంగా మనకు ఏదైనా ప్రాణాపాయం ఉంది అని తెలిసినప్పుడు.. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి సమాచారం అందిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. లేదంటే ఎమర్జెన్సీ కాల్ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఇలా ఎంతోమంది ఎమర్జెన్సీ కాల్స్ చేసి ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వారు ఉన్నారు. కానీ సమాధి నుంచి ఎమర్జెన్సీ కాల్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా. సమాధి నుంచి కాల్ చేయడం ఏంటి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారు కదా.
ఇలాంటి వింతైన ఘటన ఇటీవల అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగింది అని చెప్పాలి. చాయ్ కియోంగ్ ఆన్ అనే వ్యక్తి భార్య రిటైర్మెంట్ డబ్బు పొందేందుకు ఆమె బతికుండగానే చివరికి సమాధి చేసేసాడు. డబ్బు కోసం భార్యని దారుణంగా కత్తితో పొడిచి ఇక కాళ్లు చేతులు టేపుతో కట్టేసి ఒక బాక్స్ లో పడేస్తాడు. ఇక వెంటనే ఆ బాక్స్ ను కారులో తీసుకువెళ్లి మూడు అడుగుల గోతిలో పాతేశాడు అని చెప్పాలి. ఇక ఇలా పాతిపెట్టిన కాసేపటికే సదరు మహిళా కు స్పృహ వచ్చి తన చేతికి ఉన్న ఆపిల్ వాచ్ కారణంగా ఎమర్జెన్సీ కాల్ చేసి తన ప్రాణాలను కాపాడుకుంది.