వైసిపి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అంటే విపరీతంగా వైసీపీ పార్టీలో ప్రేమించే నాయకులు చాలామంది ఉన్నారు. కొంతమంది నాయకులు వైయస్ జగన్ కి అధికారం వచ్చాక ప్రేమించిన వాళ్ళు అయితే మరికొంతమంది ప్రతిపక్షంలో ఉన్న సమయం నుండి ఆయన్ను అంటిపెట్టుకుని ప్రేమించిన వాళ్ళు కొంతమంది.  వాళ్లలో ఒకరు మంత్రి పుష్ప శ్రీవాణి. వైసిపి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చాలామంది ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడం జరిగింది. అప్పట్లో అధికారంలో చంద్రబాబు ఉన్న నేపథ్యంలో అనేక ఆఫర్లు వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎర చూపి తన పార్టీలోకి లాగేసి కోవడం జరిగింది. పార్టీ లోకి రాని వారిని కేసులతో ఇబ్బందులకు గురి చేయడం జరిగింది.

 

అయితే చంద్రబాబు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఎన్ని ప్రలోభాలు పెట్టిన కేసులు పెట్టినా పుష్ప శ్రీవాణి మాత్రం జగన్ వెంటే ఉండటం జరిగింది. ఎన్నికల ప్రచారంలో కూడా వైఎస్ జగన్ పుష్ప శ్రీవాణి తన చెల్లెలు లాంటిదని అటువంటిది కచ్చితంగా అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం ఎన్ని అయితే ఇబ్బందులపాలు అయ్యిందో దానికి రెట్టింపు విధంగా న్యాయం చేస్తానని మాట ఇచ్చి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక పుష్పశ్రీవాణి కి మంత్రి పదవి సీఎం జగన్ కేటాయించారు. ఇటువంటి తరుణంలో జగన్ పై మరి ఆయన కుటుంబంపై ఎక్కువగా అభిమానించే పుష్పశ్రీవాణి తన చేతిపై గతంలో పచ్చబొట్టు వేయించడం జరిగింది.

 

అయితే తాజాగా జగన్ పై టిక్ టాక్ వీడియో చేసి సోషల్ మీడియా లో రచ్చ చేశారు మంత్రి పుష్ప శ్రీవాణి. ఇటువంటి తరుణంలో ఒక బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి ఇటువంటివి చేయటం ఏంటి అని సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్లు కామెంటు చేస్తున్న తరుణంలో అది కేవలం 15 సెకన్ల వీడియో అని ఆమె తన సన్నిహితుల దగ్గర అన్నట్టుగా తెలిసింది .. బాలకృష్ణ లాంటి వారు అసంబ్లీ కి రాకుండా సినిమా లు చేసుకుంటె తప్పు లేదు కానీ 15 సెకన్ల వీడియో గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అన్నారట ఆమె. 

మరింత సమాచారం తెలుసుకోండి: