వీటిలో ఒకటి బాపట్ల. జనరల్ కేటగిరీకి చెందిన ఈ నియోజకవర్గంలో టీడీపీ 1999 తర్వాత.. ఇప్పటి వరకు గెలిచింది లేదు. అప్పట్లో మంతెన అనంత వర్మ విజయం సాధించారు. ఇక, తర్వాత.. ఎంత మంది పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కలేదు. రాష్ట్ర విభజన తర్వాత.. చంద్రబాబు హవా వీచినా.. ఇక్కడ మాత్రం వైసీపీ విజయం సాధించింది. ఇప్పుడు ఇక్కడ టీడీపీ గెలుపు సమీకరణలు పుంజుకున్నాయి. బాపట్ల నియోజకవర్గం.. టీడీపీ ఇంచార్జ్గా ఉన్న వేగేశనశ్న నరేంద్ర వర్మ.. దూకుడుగా ముందుకు సాగుతున్నారు.
నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. పార్టీ నాయకులకు చేరువగా మెలుగుతున్నారు. వాస్తవానికి గత ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి కూడా ఆయన వేగేశన ఫౌండేషన్ ద్వారా.. ప్రజలకు చేరువయ్యారు. అనేక కార్యక్రమాలు అమలు చేశారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు స్వయంగా.. ట్యాంకులు ఏర్పాటు చేసి.. నీటి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా.. అన్ని మతాలను.. కులాలను గౌరవించడం.. వారివారి పండగల సమయంలో.. వారికి తోఫాలు.. ఆర్థిక సాయం చేయడం వంటివి వేగేశనకు ప్లస్గా మారాయి. ఇంటింటికి టీడీపీతో ఆయన బాపట్ల నియోజకవర్గంలో ప్రతి గడపా తొక్కారు. ఒకానొక టైంలో వర్మకు టిక్కెట్ ఇస్తే బాపట్లలో టీడీపీ గెలుపు ఖాయమన్న అంచనాలు వచ్చేశాయి.