వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఆమె వ్యతిరేకవర్గం పోటా పోటీగా జగన్ పుట్టిన రోజు వేడుకలు చేసి బల ప్రదర్శన చేయాల ని నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే రెండు వర్గాలు నియోజకవర్గంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీ లు చించివేయడంతో పెద్ద రచ్చ జరిగింది. ఎమ్మెల్యే రోజా వర్గానికి చెందిన వారే ఈ పని చేశారంటూ కేజే కుమార్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
మరో వైపు అసమ్మతి నేతలుగా ఉన్న ఏలుమలై - కేజే కుమార్ - లక్ష్మీపతిరాజు - భాస్కర్రెడ్డి - మురళీరెడ్డి - రవిశేఖరరాజు - శ్రీశైలం పాలక మండలి చైర్మన్ చక్రవర్తిరెడ్డి రోజా కు వ్యతిరేకంగా బలమైన గ్రూపు ను ఏర్పాటు చేశారు. వీరికి జిల్లాకే చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి బలమైన సపోర్ట్ ఉందని అంటున్నారు. మరో వైపు రోజా నాన్ లోకల్ అన్న ప్రచారం కూడా గట్టిగా తీసుకు వస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తామని కూడా వారు వార్నింగ్ ఇస్తున్నారు. ఏదేమైనా రోజుకు నగరి లో మామూలు అసమ్మతి లేదనే చెప్పాలి. మరి ఈ అసమ్మతి నుంచి ఆమె ఎలా ? బయట పడుతుందో ? చూడాలి.