ఇక ఈ మధ్య కాలంలో లోన్ రికవరి ఏజెంట్ల అరాచకాలు అనేవి తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక డబ్బులు తిరిగి కట్టకపోతే..ఆ వ్యక్తుల్ని లేదా ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్లున్న వ్యక్తులకు ఫోన్లు చేసి వారిని రాబందుల్లా పీక్కు తింటున్నారు. లోన్ డబ్బులు కట్టాల్సిందేనంటూ వారు రాచి రంపాన పెడుతున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి ఇంకా వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ని సైతం వేధించారు. ఇక లోన్ తీసుకున్న వ్యక్తితో తనకెలాంటి సంబంధం లేదని, దయచేసి తనకు ఫోన్లు చేయొద్దని మర్యాదపూర్వకంగా మాట్లాడినా కూడా పదే పదే ఫోన్లు చేసి టార్చర్ పెట్టారు.ముందుగా ఫుల్లర్‌టన్ బ్యాంక్ నుంచి ఓ మహిళా ఏజెంట్ ఫోన్ చేసి.. పాతపాటి అశోక్ కుమార్ అనే వ్యక్తి మీ ఫోన్ నంబర్‌ను ప్రత్యామ్నాయంగా ఇచ్చారని,ఇంకా ఆయన తీసుకున్న లోన్ మీరే కట్టాలని చెప్పింది.ఇక అతనెవరో తెలియదని, కావాలంటే కేసు పెట్టి ఆ వ్యక్తిని జైల్లో పెట్టుకోండని కూడా చెప్పారు.


ఇంకా అప్పుడు మరో మహిళా రికవరి ఏజెంట్ ఫోన్ అందుకొని,దెబ్బకు బెదిరింపులకు దిగింది. తనకెవరో తెలియదని చెప్తున్నా కూడా ఆ అశోక్, మీరు కలిసి తిన్న రూ. 8 లక్షలు ఎవరు కడతారు? కట్టాల్సింది మీరేనంటూ ఆమె దబాయించింది. దీంతో ఇక చిర్రెత్తుకొచ్చిన అనిల్ కుమార్ చెప్పుతో కొడతానంటూ ఫైర్ అయ్యారు. అందుకు తనకూ మాట్లాడ్డం వచ్చని ఆ మహిళ ఇంకా రెచ్చిపోయింది.అప్పటికీ కూడా anil KUMAR YADAV' target='_blank' title='అనిల్ కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనిల్ కుమార్ యాదవ్ ఫోన్ పెట్టేసి సైలెంట్ అయితే.. 20 సార్లకు పైగా ఫోన్ చేసి ఆ మహిళ చాలా హింసించింది. డబ్బులు కట్టేదాకా ఫోన్ చేస్తూనే ఉంటానంటూ ఆమె మొండికేసింది.ఇక ఈ వ్యవహారం తెగేలా లేదనుకున్న అనిల్ కుమార్.. ఇక తనదైన శైలిలో యాక్షన్ తీసుకున్నారు. ఆ బ్యాంక్ వివరాలు సేకరించి, వెంటనే పోలీసుల్ని పంపించారు. తరువాత ఆ ఏజెంట్లకు బేడీలు వేసి, లోపలేశారు. అప్పటివరకూ కూడా తాము మాట్లాడింది ఎమ్మెల్యే అనిల్ కుమార్‌తోనని వాళ్లూ గ్రహించలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: