మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన విమర్శలే జయరాంపై వస్తున్న ఈ ఆరోపణలకు కారణం అని చెప్పొచ్చు.. స్కాములో ఉన్న నిందితుడు కార్తీక్ జయరాం కుమారుడికి బెంజ్ కార్ ని కొనిచ్చారని అయన ఆరోపణలు చేయగా మంత్రి దీన్ని తీవ్రంగా ఖండించారు.అంతేకాదు ఈ మంత్రి సిఫారసు మేరకే కార్తీక్ ని 14 వ నిందితుడిగా ఏసీబీ చేర్చిందని ఆరోపించారు.. ఒకవేళ నేను బెంజ్ కారు తీసుకుంటే ఆ నిందితుడు ఎలా పట్టుపడేవాడని అన్నారు.. మరి తనపై పై వస్తున్న ఆరోపణలు అబద్ధమేనని నిరూపించుకోకపోతే మంత్రి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో అయన ఏం చేస్తారో చూడాలి..