లాక్ డౌన్ లో హైదరాబాద్ కి వెళ్లిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి ఎన్ని రోజుల సమయం తీసుకున్నాడో తెలిసింది.. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంలో కరోనా విజృంభిస్తున్న ఆ సమయంలో అందరిని గాలికి వదిలేసి చంద్రబాబు ప్రవర్తించిన తీరు పట్ల ఇప్పటికీ ప్రజల్లో ఆగ్రహం వుంది..ఇప్పటికే ఏడు నెలలుగా చంద్రబాబు, ఆయన తనయుడు కూడా హైదరాబాద్ కి పరిమితమయ్యారు. ప్రజలంతా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు పూర్తిగా జూమ్ కి పరిమితమయ్యారు. జనాలను ఆదుకునేందుకు ఆయన వ్యక్తిగతంగా సహాయం అందించిన దాఖాలాలు కనిపించలేదు.