దుబ్బాక లో ఎన్నికలకు మరో మూడు రోజులే సమయం ఉండడంతో అక్కడ అన్ని పార్టీ లు ప్రచారాల జోరును పెంచాయి.. ఏ పార్టీ కి ఆ పార్టీ తమ పార్టీ గెలుస్తుందంటే తమ పార్టీ గెలుతుందని ధీమా గా ఉండడంతో ఇక్కడ రాజకీయం కొంత ఆసక్తి గా మారిపోయింది. కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీ లు సైతం ఇక్కడ తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.. మరో వైపు అధికార పార్టీ కూడా ఏం తక్కువ తినలేదు.. దుబ్బాలలో గులాబీ జెండా రేపెరేపలాడడం ఖాయం అన్నట్లు వ్యాఖ్యలు చేస్తుంది. హరీష్ రావు అయన తన సొంత నియోజకవర్గంలా ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తున్నారు.. కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై శ్రద్ధ వహించగా, కేటీఆర్ గ్రేటర్ పై ద్రుష్టి సారించారు.. దాంతో హరీష్ రావు కి దుబ్బాక లో పార్టీ ని గెలిపించే బాధ్యత ని ఇచ్చారు..