కోపం మనిషిని ఎంత మూర్ఖంగా చేస్తుంటే తన కోపమే తన శత్రువు అన్నట్లు పుస్తకాల్లో చదివే ఉంటాము సరిగ్గా ఇప్పుడు అలానే జరిగింది .ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు అంత బాగానే ఉన్నారు కానీ ఆ పెళ్లి ఆమె పాలిట మృత్యువు అవుతుందని గ్రహించలేక పోయింది. ఒకరి మీద గొడవతో మరొకరిని చంపేసిన ప్రబుద్దుడి కథ ఇప్పుడు చూద్దాం..

 

నిద్ర లేవడం లేటైందని భర్తను తిట్టడమే ఆమె పాలిట శాపమైంది. అది కూడా మరదలి ముందు తిట్టడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త.. ఆమెను దారుణంగా చంపేసిన ఘటన వెలుగుచూసింది. ఈ దారుణ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. ఘజియాబాద్‌కి చెందిన ఫజ్రుద్దీన్ తన భార్య సమీనాతో కలసి ఢిల్లీ వెళ్లారు.అనారోగ్యం కారణంగా అతను ఆసుపత్రికి వెళ్లారు. ఢిల్లీలో ఉంటున్న భార్య చెల్లెలు ఇంటికి వెళ్లారు.

 

అక్కడే ఉండి ఆస్పత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకునేందుకు వెళ్లాల్సి ఉంది. అయితే ఫజ్రుద్దీన్ ఉదయాన్నే నిద్ర లేవలేదు. బాగా ఆలస్యంగా నిద్ర లేవడంతో అతని భార్య సమీనా కోప్పడింది. అంతేకాకుండా తన చెల్లెలి ముందే తననుఁ తిట్టడంపై కోపోద్రేకుడు అయ్యాడు. అంతేకాక ఎక్కువ మాట్లాడితే చంపేస్తానని అతను అన్నా కూడా ఆమె వినకుండా తిట్టిపోసింది దానితో ఉన్మాదిగా మారిన ఫజ్రుద్దీన్ భార్యను చంపేశాడు.

 

గొంతునులిమి ఊపి రాడకుండా చేసి దారుణం గా హత్య చేశాడు. అతను కోపం తో గట్తిగా పట్టుకోవడం తో ఆమె ఇంట్లో వాళ్ళను పిలవడానికి కూడా రాకపోవడంతో ఊపిరి ఆగిపోయి చనిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటా హుటిన ఆసుపత్రికి తీసుకెళ్లిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్దారించడంతో అతనిపై ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: