తెలంగాణ బిజెపి నేత కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలోని ప్రజలనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రజలకు రైళ్లను పరిచయం చేసింది ప్రధాని నరేంద్ర మోడీయేనని అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి. అప్పటివరకు  ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఎర్రబస్సు తప్ప రైలు అంటేనే తెలియదు అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైలు ప్రయాణం అలవాటు లేని తెలంగాణ ప్రజలకు రైలు మార్గాలను ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చి రైలును అలవాటు చేశారు అంటూ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల కోసం ఇప్పుడు 427 రైల్వేస్టేషన్లు హై స్పీడ్  వైఫై సౌకర్యం కల్పించామని... మోడీ ప్రధాని అయ్యాక అనేక కొత్త రైళ్లను తీసుకు వచ్చాము  అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 


 కాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాలు పెద్ద దుమారమే రేగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా  కిషన్రెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇక కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా సెటైర్లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పై తమదైన శైలిలో ట్రోల్స్  తో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. 

 

 

 తెలంగాణ ప్రజలకు రైలు అంటే తెలియదని .  బిజెపి వచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలకు రైలు పరిచయం అయింది అంటూ కిషన్ రెడ్డి చేసిన మాటలకు ఉద్దేశిస్తూ ... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి బాహుబలి గా మారి రైలు తీసుకొస్తున్నారు అంటూ ఒక ఫోటో ని మార్ఫింగ్ చేసి నెటిజన్లు వింత వింత కామెంట్ చేస్తున్నారు.ఇక ఓ నెటిజన్ అయితే మోడీ రాక ముందే తాను రైలు ఎక్కాలని... మరి తాను  తెలంగాణ వాడిని కాదా..  లేక నేను చేసింది రైలు ప్రయాణం కాదా అంటూ చిత్రవిచిత్రమైన కామెంట్లు కూడా పెడుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం కిషన్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం తెలంగాణలో దుమారం రేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: