ఇంగ్లండ్‌ లోని బెర్క్‌ షైర్ నగరంలో వింత ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలిద్దరూ శృంగారం చేసే సమయంలో వారు పడుకున్న మంచం విరిగింది. దీంతో.. ఈ జంట కోర్టుకు ఎక్కింది. వీరిద్దరూ బెర్క్‌ షైర్ నగరానికి చెందిన దంపతులు జాన్ మార్షల్, క్లైర్ ఇటీవల మంచం కొనటానికి ఓ ఫర్నిచర్ షో రూమ్ కి వెళ్లారు. అక్కడ ఒక ఆ మంచం నచ్చటంతో వారిరువు కాలిసి దాన్ని కొని ఇంటికి తెచ్చుకున్నారు. తర్వాత కొత్త మంచం కదా అని తన భార్యతో అతను శృంగారంలో పాల్గొంటుండటా ఉన్నట్టుండి ఒక్క సారిగా మంచం విరిగిపోయింది. దీనితో జాన్ మార్షల్, క్లైర్ కిందపడ్డారు వారిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. అలా ఒక్కసారి కింద పడటంతో క్లైర్‌‌ కి నడుము విరిగినంత పనైంది.

 

ఆ తర్వాత వారు ఇద్దరూ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అనంతరం ఆరోగ్యం కొంచెం కుదుట పడ్డాక వారు ఒక నిర్ణయం కి వచ్చారు. ఆ తర్వాత క్లైర్ ఆ ఫర్నీచర్ సంస్థ పై కోర్టులో కేసు వేసింది. ఇటీవలే లండన్ హై కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగింది. దీనిపై ఆ మహిళ మాట్లాడుతూ.. తన భర్తతో శృంగారంలో పాల్గొన్న సమయంలో ఒక్కసారిగా మంచం విరిగిపోయిందని, దానివల్ల తన వెన్నుముకకు తీవ్ర గాయమైందని ఆమె పేర్కొంది.

 

మంచం విరిగిన తర్వాత తన భార్య నొప్పితో బాధపడుతుంటే.. మొదటగా ఆమె సరదా కోసం ఇలా చేస్తుందేమోనని తాను అనుకున్నానని మార్షల్ తెలిపాడు. కానీ ఆమె పైకి లేవలేకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించాలని ఆమె కోరిందని ఈ విషయాన్ని జాన్ కోర్టుకు తెలిపాడు. తమకు ఇంత నష్టాన్ని కలిగించిన సంస్థ ద్వారా పరిహారం ఇప్పించాలని కోర్టును కోరాడు. మంచాన్ని సరిగ్గా బిగించకపోవడంతో వల్లే అది విరిగిపోయి ఉంటుందని, తమ సంస్థ తయారు చేసిన మంచంలో ఎలాంటి లోపం లేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. తాము అన్ని జాగ్రత్తలు తీసుకుని దాన్ని తయారు చేశామని సంస్థ ప్రతినిధులు కోర్టుకు తెలిపారు. ఈ కేసుపై ఇంకా ఎలాంటి న్యాయం రాలేదు. ఇంకా విచారణలో ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: