టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటిదాకా పెద్దగా కేసుల్లో ఇరుక్కోలేదు. ఇరుక్కున్నా కోర్టుల్లో ఆయన పైకేసు లు  నిలబడలేదు. అయితే తాజాగా ఓ కేసులో మాత్రం ఏ1గా చంద్రబాబు నిలిచాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.విజయనగరం జిల్లా రామతీర్థంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కారు‌పై జరిగిన దాడి కేసులో   నెల్లిమర్ల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడును నిందితుడిగా చేర్చారు పోలీసులు .నెల 2వ తేదీన చంద్రబాబు నాయుడు రామతీర్థంకు వచ్చారు. అయితే అంతకంటే ముందుగానే అక్కడికి చేరుకున్న విజయసాయిరెడ్డి కొండపైకి వెళ్లి రాముని విగ్రహం ధ్వంసం అయిన ప్రాంతాన్ని పరిశీలించారు. కొండపై ఆలయాన్ని పరిశీలించి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డిని అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న టీడీపీ, బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు విజయసాయిరెడ్డి కారుపై దాడి చేశారు. ఈ ఘటనలో విజయసాయిరెడ్డి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అదే రోజు విజయసాయిరెడ్డి నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


ఈ దాడికి బాధ్యులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావును పేర్కొన్నారు.ప్రాథమిక విచారణ అనంతరం వీరిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.ఈ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఏడుగురు టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. గురువారం వారిని విజయనగరంలో కోర్టులో హాజరుపరిచారు. అక్కడ వీరికి కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. అరెస్టైన వారిలో సువ్వాడ రవిశేఖర్, మహంతి శ్రీహరి, పాపునాయుడు, జగన్నాథం, పైడిరాజు, శీర రామకృష్ణ, సుంకర నాగరాజులు ఉన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలపై, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులు జరిగినా ప్రభుత్వం ఇప్పటి వరకు నిందితుల్ని పట్టుకోలేదన్నారు. కానీ ప్రశ్నించిన వారిని మాత్రం అరెస్ట్ చేస్తుందని విమర్శించారు. అరెస్ట్ అయిన ఏడుగురికి కోర్టు ఇప్పటికే రిమాండ్ విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: