అయితే మొదటి ఎన్నికల్లో జగన్ గెలవలేకపోయినా రెండు సారి సారి మాత్రం అత్యధిక మెజారిటీ తో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.. అయితే రాష్ట్రం విడిపోయి అయోమయంలో ఉన్న ప్రజలు అనుభవం ఉన్న చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు తప్పా జగన్ పై అపనమ్మకం కాదు.. లేదంటే అప్పుడే అయన గెలిచి ఉండేవారు.. అయితే 2014 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇదే సందు అనుకునిచేసిన అవినీతిని ప్రజలు గ్రహించి వెంటనే జగన్ వైపుకు మళ్ళారు..
అయితే ఎన్ని మెట్లు ఎక్కినా జగన్ తనను నమ్మిన వారిని మాత్రం మర్చిపోలేదు. తన క్యాబినెట్ సహచరుడు, ముఖ్య అనుచరుల్లో ఒకరైన పేర్ని నాని తల్లి మరణించిన తరుణంలో ఆయన మచిలీపట్నం పయనమయ్యారు. మంత్రి కుటుంబాన్ని పరామర్శించారు. తల్లి మరణంతో శోకంలో ఉన్న ఆయన్ని ఓదార్చారు. తద్వారా తనకు సన్నిహితులైన వారి కోసం సమస్యలున్నప్పటికీ తాను ఎంత దూరమయినా వెళ్లేందుకు తండ్రి బాటను వీడబోనని నిరూపించుకున్నారు.కరోనా కాస్త నిదానించిన తరుణంలో అందరినీ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న ముఖ్యమంత్రి దానికి అనుగుణంగా పలు జాగ్రత్తలు తీసుకుంటూనే బందరు లో అడుగుపెట్టారు.