ఈ మధ్య కాలంలో ఏకంగా వావివరుసలు మరిచిపోయిన నీచులు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఎంతోమంది  మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఇక్కడ ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది ఏకంగా చెల్లెలు వరుస యువతి పై కన్నేశాడు ఇక్కడ ఒక కామాంధుడు. ఏకంగా తన కోరిక తీర్చాలి అంటూ తరచూ వేధింపులకు గురి చేశాడు. సదరు యువతి కామాంధుడి తో శారీరక సంబంధానికి నిరాకరించింది. అయినప్పటికీ వదలలేదు దారుణంగా మహిళపై అత్యాచారానికి ఒడిగట్టి చివరికి సదరు మహిళను దారుణంగా కడతేర్చాడు ఇక్కడ ఒక నీచుడు. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చి అందరినీ షాక్ కి గురి చేసాయి. బీహార్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


 బెగుసరాయ్ ప్రాంతానికి చెందిన నందు అనే వ్యక్తి లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు... అయితే ఇటీవల తమ ఇంటి వద్ద ఓ మహిళ అద్దెకు దిగింది. ఆమె స్వయానా నందు పిన్ని కూతురు. కాకా నందు తరచూ వారి ఇంటికి వెళ్లి వస్తూ ఉండేవాడు. భర్త ఆమెను మోసం చేయడంతో ప్రస్తుతం తల్లి కుమార్తే  తో కలిసి ఉంటుంది సదరు మహిళ. ఒంటరి మహిళ కావడంతో నందు సదరు మహిళ పై కన్నేశాడు. సరైన సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే గతవారం ఫుల్లుగా మద్యం తాగి మద్యం మత్తులో సదరు మహిళ ఇంటికి వెళ్ళాడు.


 ఆ సమయంలో ఏదో పని నిమిత్తం కుమార్తె తల్లి బయటకు వెళ్లడంతో మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. ఇక అదే అదునుగా భావించి కోరిక తీర్చాలంటు  బలవంతం పెట్టాడు. అన్న వద్దు.. ఇలా చేయడం తప్పు అంటూ సదరు మహిళ కాళ్ళ వెళ్ళ  పడింది. అయినప్పటికీ కనికరించని నీచుడు  ఏకంగా ఆమెను తీవ్రంగా కొట్టి పశువాంఛ తీర్చుకున్నాడు అక్కడితో ఆగకుండా ఏకంగా ఊపిరాడకుండా చేసి సదరు మహిళ ప్రాణం తీశాడు. ఆ మహిళను  చీరతో ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి అక్కడి నుంచి పరారయ్యాడు.  అందరూ ఆత్మహత్య గానే భావించారూ.  ఇటీవలే పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా మద్యం మత్తులో కమల ఇంటికి నందు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: