ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర కేబినెట్ లోకి యువతను ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం రమేష్ ని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ నుంచి ధర్మపురి అరవింద్ ని కచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అనే చర్చలు జరుగుతున్నాయి. ధర్మపురి అరవింద్ కి ఇప్పటికే బీజేపీ పెద్దలు సమాచారం కూడా పంపించారు అని అంటున్నారు. దీంతో ఆయనను క్యాబినెట్లోకి తీసుకోవడం దాదాపు ఖాయంగా కనబడుతుంది.
కిషన్ రెడ్డిని కూడా శాఖ మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తోపాటుగా దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టాయి. దీనితో ఆయన క్యాబినెట్ మార్చే అవకాశాలు ఉన్నాయి అని వ్యాఖ్యలు కనపడుతున్నాయి. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆయన కొన్ని కొన్ని విషయాల్లో విమర్శలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. దీంతో తెలంగాణలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆయనను ఒక ఆటాడుకున్నారు అనే భావన కూడా చాలామందిలో ఉంది. కాబట్టి బిజెపి కూడా ఆయన విషయంలో అసహనం గానే ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.