ఈ మధ్య కాలంలో ఆడపిల్లలకు ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే. కామంతో కళ్లు మూసుకుపోతున్న మనుషులు నేటి సమాజంలో ఎక్కువ అవుతున్న తరుణంలో అడుగడుగునా మహిళలు కామపు  కోరల్లో చిక్కుకుని బలి  అవుతూనే ఉన్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై జరుగుతున్న దారుణ ఘటనలు  మాత్రం ఎక్కడా కంట్రోల్ కావడం లేదు. ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు పై తెలిసిన అబ్బాయి లే సెక్సువల్గా వేధింపులకు పాల్పడడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.


 ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఇక మరో యువతిని లైంగికంగా వేధించారు అంతేకాదు అనంతరం వారిని ఒక సీక్రెట్ ప్లేస్ లో కూడా బంధించి మరింత హింసించారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణే లో వెలుగులోకి వచ్చింది. దుర్మార్గుల  నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో 16 ఏళ్ల యువతి  ఫ్రెండ్స్ కొందరు ఆమెను ఆమె చెల్లెల్ని జనరల్ గా కలిసేందుకు బయటకు రావాలని కోరారు.  దీంతో ఫ్రెండ్స్ ని కలవడానికిఇద్దరు బాలికలు బయటికి వెళ్లారు. అక్కడి నుంచి ఆ ఇద్దరిని వేరే  ప్రదేశానికి తీసుకెళ్లారు అబ్బాయిలు.



 ఈ క్రమంలోనే అక్కడ యువతిపై అత్యాచారం చేశారు ఇక చెల్లెలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.  తెల్లవారే  వరకు కూడా వారిద్దరిని  ఒక సీక్రెట్ రూమ్ లో బంధించారు.  ఆ తర్వాత నిందితుల నుంచి తప్పించుకున్న  ఇద్దరు యువతులు జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిఐదుగురు నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. కాగా ప్రస్తుతం బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: