ఈ మధ్యకాలంలో నేరాలు రోజురోజుకు పెరిగి పోతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  నాగరిక సమాజంలో ఉన్మాదులుగా మారిపోతున్న మనుషులు.. సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కాస్తయినా వెనుకడుగు వేయడం లేదు.  కిల్లి తిన్నంత సులభంగా మనుషుల ప్రాణాలు తీస్తున్నారు.  దీంతో ప్రతి ఒక్కరు కూడా నేటి సమాజంలో ఎక్కడ ఎవరు దాడి చేసి ప్రాణాలు తీస్తారో  అని ప్రాణభయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే.  ఈ మధ్య కాలంలో ఇలా దారుణ హత్యలు ఎన్నో వెలుగులోకి వచ్చిన సంచలన గా మారిపోతున్నాయి.


 ఇటీవలే మరో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. పది మంది భార్యలు ఉన్న ఒక వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత  మార్చడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భోజపుర  కు చెందిన జగన్ లాల్ యాదవ్ అనే రైతు.. తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కారణంగా కోటీశ్వరుడు గా మారిపోయాడు.  అయితే అతనికి 10 మంది భార్యలు ఉన్నారు. ఇక పోతే తన ఆస్తి మొత్తం దత్తపుత్రుడు కి బదిలీ చేయాలని జగన్ లాల్ నిర్ణయించుకున్నాడు.



 ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఇంతలో దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు ఆ వ్యక్తిని దారుణంగా హత్య చేసి పరారయ్యారు.  పొలంలో కి వెళ్ళిన అతడిపై దాడి చేసి గొంతు కోయడం తో పాటు తల పై రాళ్లతో కొట్టి చంపారు. అయితే ప్రధాన రహదారి పక్కన అతనికి భారీగా భూములు ఉండటం కారణంగానే వాటి పై కన్నేసిన కొంతమంది దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే అతనికి పది మంది భార్యలు ఉన్నప్పటికీ పిల్లలు ఎవరూ లేరని..  ఈ క్రమంలోనే ఓ దత్తపుత్రుడు ఉన్నాడు అని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: