చాలీ చాలని జీతాలతో ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని గుర్తించకపోయినా పర్లేదు కాని వారి కష్టాన్ని గుర్తించి వారికి తగిన ప్రతి ఫలం అందేలా ప్రభుత్వం చూడాలి. వారికి జీతాలు పెంచాలి. వారి అక్కర్లు, అవసరాలు తీర్చాలి. అంతెందుకు మనం ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతున్నామంటే దాని వెనకాల ఉపాధ్యాయుని హస్తం వుంది.ఎందుకంటే సమాజంలో ఒక మనిషి ఉన్నత శిఖరాలు అందుకోవాలంటే ఖచ్చితంగా చదువు ఉండాలి. అలాంటి చదువు మనకు ఉపాధ్యాయుని ద్వారానే లభిస్తుంది. కాని అలాంటి ఉపాధ్యాయులను ఈనాడు ఎవరూ గుర్తించట్లేదు.
ఇక ఒక విషయం గమనించినట్లయితే ప్రైవేట్ స్కూల్స్ లో పని చేసే టీచర్ లకు చాలా మందికి కూడా పదివేలకి మించి జీతం ఉండడు. ఆ చాలీ చాలని జీతంతో వారు కుటుంబాలని ఏ విధంగా పోషిస్తారు. కాబట్టి గవర్నమెంట్ వారికి ప్రభుత్వం తరపున వారి నెలవారి ఖర్చులకి ఎంతో కొంత ఆర్ధిక సహాయం చెయ్యాలి. ఎందుకంటే ఉపాధ్యాయులు బాగుంటేనే నేటి విద్యార్థులు బాగుపడతారు. రేపటి సమాజం బాగుపడుతుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి