ఈ క్రమంలో విజయోత్సవ ర్యాలీలో ఘర్షణలు జరగడంతో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ జనసేన పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో గ్రంధి కామెంట్స్ కు పవన్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ఇష్టమొచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోమని ఒళ్ళు దగ్గెరపెట్టుకోవాలని హెచ్చరించారు. మున్సిపల్ వ్యాన్ వస్తోందంటూ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిస్తామని టూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. భీమవరం ఎమ్మెల్యే ఆకు రౌడీ అని కోపరేటివ్ బ్యాంకు లో సొమ్ము దాచుకునే చిన్నాచితక శ్రమజీవులను దోచేసిన వ్యక్తి ఈ వైసీపీ ఎమ్మెల్యే అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇలాంటి వాడు వేరే విధంగా ప్రవర్తిస్తాడని ఆశించలేము అని వ్యాఖ్యానించారు.
గ్రంధి శ్రీనివాస్ లాంటి వ్యక్తికి ఎలా సమాధానం చెప్పాలో తమకు బాగా తెలుసు అని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే చర్యలపై అనవసరంగా పంపించవద్దన్న పవన్ పిచ్చి కుక్క కరిస్తే తిరిగి కర వకూడదని మున్సిపాలిటీ వ్యాన్ వచ్చే వరకు ఆగాలి అన్నారు. త్వరలో మున్సిపల్ వ్యాన్ వస్తుంది. పిచ్చి కుక్క ని పట్టుకుని రమ్మని ఘాటుగా వ్యాఖ్యానించారు. మా వాళ్ళ తప్పుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో సరిదిద్దుకుంటాం. అంతేతప్ప ఇళ్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని హెచ్చరించారు.
భీమవరంలో గతంలోనూ శాంతిభద్రతలు దెబ్బతిన్నoదున డీజీపీ గౌతమ్ సవాంగ్ కు కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మత్స్యపురి లో జనసేన విజయాన్ని భరించలేని వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని పవన్కళ్యాణ్ ఆరోపించారు. మత్స్యపురి గ్రామపంచాయతీలో కారేపల్లి శాంతిప్రియ అనే మహిళా సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందారని, విజయం అనంతరం అంబేద్కర్ విగ్రహానికి దండమే గదులను వైసిపి వాళ్ళు తొలగించి ఆమె ఇంటి పైన దాడి చేశారని పవన్ వెల్లడించారు. అంతేకాకుండా అనంతలక్ష్మి అనే మత్స్యకార మహిళలు ఇంటి పైన దాడులు చేశారని తెలిపారు. వైసిపి కి చెందిన 151 ఎమ్మెల్యేలంతా ఎదుటి వాళ్ళని హింసించడం పైనే దృష్టి పెడుతున్నారని, వారి డిఎన్ఎ అలా ఉందని వ్యాఖ్యానించారు. స్థానిక ఎమ్మెల్యే సభ్యసమాజం తలదించుకునేలా బూతులు మాట్లాడుతున్నాడు. పైగా వ్యక్తిగతంగా నన్ను దూషి స్తున్నాడని పవన్ వెల్లడించారు.