ఈ ఏడాది తొలి త్రైమాసికంలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఎన్సీఆర్ నగరాల్లో 3.15 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగగా.. మన నగరంలో 18 లక్షల చ.అ. రెండు ప్రధాన ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్ఫ్రాంక్ ఇండియా తెలిపింది. క్యూ1లో వచ్చిన పెట్టుబడులను దేశాల వారీగా చూస్తే.. కెనడా నుంచి అత్యధికంగా 915 మిలియన్ డాలర్లు, అమెరికా నుంచి 830, సింగపూర్ నుంచి 341, మన దేశం నుంచి 62 మిలియన్ డాలర్లు వచ్చాయి.
2011 జనవరి నుంచి 2021 మార్చి మధ్య కాలంలో హైదరాబాద్ రియల్టీలోకి 16 డీల్స్ ద్వారా 2,866 మిలియన్ డాలర్ల పీఈ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి.ఈక్విటీ రూపంలో 3,241 మిలియన్ డాలర్ల పీఈ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇందులో 71 శాతం ఆఫీస్ స్పేస్లోకి, 15 శాతం రిటైల్, 7 శాతం నివాసం, 7 శాతం గిడ్డంగుల విభాగంలోకి పెట్టుబడులు వచ్చాయి. 2020 క్యూ1లో దేశీయ రియల్టీలోకి 199 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అంటే ఏడాదిలో 16 రెట్లు ఎక్కువ. విలువల పరంగా చూస్తే.. 2021 క్యూ1 పీఈ పెట్టుబడులు గతేడాదిలో 80 శాతం, అంతకు ముందు సంవత్సరంలో 48 శాతంగా ఉన్నాయి.